పీపుల్స్ వార్ చేస్తా అంటున్న ఆర్. నారాయణమూర్తి

పీపుల్స్ వార్ చేస్తా అంటున్న ఆర్. నారాయణమూర్తి

Published on Jan 12, 2012 12:10 PM IST


ఆర్.నారాయణ మూర్తి పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆయన ఎన్నో విప్లవాత్మక మరియు సామ్యవాద చిత్రాలు తీసారు. ఆయన మరో విప్లవాత్మక చిత్రం తీయబోతున్నారు. ఆ చిత్రానికి ‘పీపుల్స్ వార్’ అనే టైటిల్ ఖరారు చేసారు. శ్రీకాకుళంలోని సోంపేటలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా జరిగిన ఉదంతం పై ఆయన ఈ చిత్రాన్ని తీయబోతున్నారు.

ఈ ఉదంతంపై అక్కడి ప్రజల అనుభవాలు తెలుసుకొనేందుకు ఆయన ఆయా ప్రాంతాలు పర్యటించారు. ఈ ఉదంతం ఒక కళాకారుడిగా తన పై ఎంతో ప్రభావం చూపించాయని అన్నారు. ఈ నెల 27 నుండి షూటింగ్ ప్రారంభమవుతుందని ఆ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరిస్తామని ఆయన అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు