ప్రముఖ నటి రాశి చాలా రోజుల తర్వాత వెండితెరపై ‘పాపం ప్రతాప్’ సినిమాలో నటించి మెప్పించింది. ఒకప్పుడు హీరోయిన్గా తన సత్తా చాటిన ఈ భామ, ఇప్పుడు క్యారెక్టర్ పాత్రలలో కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా తన సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆమె పంచుకుంది. ఈ చిత్రంలో హీరో తిరువీర్ తల్లి పాత్రలో రాశి నటించింది. అయితే ఈ సినిమాలో తన భర్త పాత్రను పోషించే నటుడి విషయంలో తాను ఒక చిన్న పొరపాటు పడ్డానని ఆమె సరదాగా వెల్లడించింది.
దర్శకుడు దుర్గా నరేష్ ఈ కథను వివరించినప్పుడు, సినిమాలో ఆమెకు జోడీగా అజయ్ ఘోష్ నటిస్తాడని చెప్పాడట. అయితే రాశికి అజయ్ ఘోష్ అనే పేరు వినగానే, విలన్ పాత్రలు చేసే పొడవాటి నటుడు అజయ్ అని అనుకుందట. దీంతో తన భర్తగా అజయ్ నటిస్తున్నాడని భావించి ఆమె షూటింగ్కు వెళ్లింది. కానీ తీరా సెట్స్లోకి వెళ్ళాక అక్కడ అజయ్ కనిపించకపోవడంతో ఆమె ఆరా తీసినట్లు తెలిపింది. షూటింగ్ సెట్లో అజయ్ ఘోష్ను చూసినప్పుడు మొదట ఆయన తన మావయ్య పాత్ర చేస్తున్నారేమో అని రాశి భావించిందట.
కానీ ఆయనే తన భర్త పాత్ర అని తెలిసి ఆమె ఆశ్చర్యపోయినట్లు తెలిపింది. ఈ చిన్న గందరగోళం గురించి అజయ్ ఘోష్కు వివరించి రాశి క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అజయ్ ఘోష్ అద్భుతమైన నటుడని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని రాశి ఈ సందర్భంగా ప్రశంసించింది.


