‘కాలా’ టికెట్ కోసం నిలబడి నిలబడి రజనీ అభిమాని మృతి !

‘కాలా’ టికెట్ కోసం నిలబడి నిలబడి రజనీ అభిమాని మృతి !

Published on Jun 10, 2018 3:41 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ చిత్రం మూడు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్ర టిక్కెట్‌ కోసం కుమరేశన్‌ (29) అనే యువకుడు రెండు రోజులుగా క్యూలైన్‌లో నిలబడి నిలబడి అలసిపోయి మరణించిన దురదృష్టకరమైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కుమరేశన్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు వీరాభిమాని. ఆయన సినిమా విడుదలవుతుందంటే కుమరేశన్‌ కి, ఎన్ని పనులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి రజనీ సినిమా మొదట షో చూడటం అలవాటు.

అలా కుమరేశన్‌ ‘కాలా చిత్రం’ చూడటానికి రెండు రోజులుగా భారీ క్యూలో వేచి ఉన్నప్పటికీ అతనకి ‘కాలా’ టిక్కెట్ దొరకలేదు. శుక్రవారం రాత్రి కూడా ప్రయత్నించి అలసిపోయిన అతను ఇంటికి వచ్చి ఉన్నట్టు ఉండి స్పృహ తప్పి పడిపోయాడు. కంగారుపడిన కుటుంబసభ్యులు అతనిని హాస్పిటల్ కు తీసుకువెళ్తూ ఉండగా అప్పటికే కుమరేశన్‌ చనిపోయాడని గమనించిన కుంటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుమరేశన్‌ రెండు రోజులుగా నిద్రాహారాలు మానుకోని క్యూలలో వేచి ఉండటం వల్ల అతను తీవ్ర అలసటకు గురై మరణించిట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు