ఆమూవీ తరువాత పార్టీ స్థాపించనున్నసూపర్ స్టార్

ఆమూవీ తరువాత పార్టీ స్థాపించనున్నసూపర్ స్టార్

Published on Sep 5, 2019 10:38 AM IST

సూపర్ స్టార్ రజని కాంత్ ప్రస్తుతం దర్బార్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రజిని సరసన నయనతార నటిస్తుండగా, వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజిని చాలా కాలం తరువాత పోలీస్ పాత్ర చేస్తున్నాడు.

కాగా రజిని ఈ చిత్రం తరువాత పూర్తిస్థాయి రాజకీయాలపై శ్రద్ద పెట్టనున్నారని తెలుస్తుంది. కొద్దికాలం క్రితం రజిని తన రాజకీయ అరంగేట్రం పై స్పష్టత ఇచ్చారు. త్వరలో ఓ పార్టీ ఏర్పాటు చేసి, ప్రత్యక్ష రాజకీయాలలోకి రానున్నట్లు ప్రకటించడం జరిగింది. ఐతే ఆయన పార్టీ పేరు ప్రకటించలేదు. కాగా ఇంకా రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రజిని కొత్త పార్టీ ఏర్పాటు పనుల్లో పడ్డారట.

జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలలో అనిచ్చితి ఏర్పడింది. సీఎం కుర్చీ కొరకు జరిగిన ఆధిపత్య పోరులో అధికార అన్నా డీఎంకే రెండు వర్గాలు విడిపోయింది. పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గం ఒకవైపు, జయలలిత, దినకరన్ వర్గం ఒకవైపు చేరి కత్తులు దూసుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష డీఎంకే పార్టీ కూడా కరుణానిధి మరణంతో కొంత బలహీనపడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన సమయంగా రజిని భావిస్తున్నారు. మరి రజిని రాజకీయంగా ఎంత మేర విజయం సాధిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు