ఆ విషయంలో రిస్క్ వద్దనుకుంటున్న చరణ్..?

Ram Charan

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం తన పూర్తి దృష్టిని యాక్టింగ్ పైనే పెట్టి, నిర్మాణ బాధ్యతలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. గతంలో ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ ద్వారా ‘సైరా’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన ఆయన, ప్రస్తుతానికి కొత్త సినిమాల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా ఉన్న చరణ్, వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.

చరణ్ నిర్మాణ రంగం నుండి విరామం తీసుకున్న తరుణంలో, ఆయన సోదరి సుస్మిత కొణిదెల మెగా ఫ్యామిలీ చిత్రాల నిర్మాణ బాధ్యతలను స్వీకరించారు. ఆమె సహ నిర్మాతగా వ్యవహరించిన చిరంజీవి చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సక్సెస్‌తో ఉత్సాహంగా ఉన్న సుస్మిత, త్వరలోనే తన తండ్రితో మరో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో పలు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈ వేసవిలో విడుదల కానుంది. ఆ తర్వాత వెంటనే ఆయన సుకుమార్ దర్శకత్వంలో రాబోయే భారీ క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.

Exit mobile version