
ప్రముఖ సినీ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూలై నెలలో ‘టర్బోమేఘ’ ఏవియేషన్ కంపెనీని స్థాపించారు. కంపెనీ డైరెక్టర్లలో రామ్ చరణ్ ఒకరు. వంకయలపాటి ఉమేష్ మేనేజింగ్ డైరెక్టర్. కేంద్ర రీజనల్ ఎయిర్ లైన్స్ నుండి ఈ కంపెనీకి అనుమతి లభించింది.
తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ నెల నుండి ‘టర్బోమేఘ’ సర్వీసులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఆధ్యాత్మిక ప్రదేశాలకు విమాన సేవలను అందించనున్నారు. అందరికి అందుబాటులో ఎకానమి ప్రైస్ తో స్వర్వీసులు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికుల కోసం 9 సీట్లు కల జెట్ ఎయిర్ వేస్ నడుపుతారు.