మొదటి రోజే ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ దక్కించుకున్న ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణల్లో రూ. 19.73 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజులకు రూ. 28.57 కోట్లను వసూలు చేసి మొత్తం నాలుగు రోజులకుగాను రూ.43.78 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. ఏరియాల వారీగా ఈ వసూళ్ల వివరాల్ని చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.
| ఏరియా | వసూళ్లు |
| నైజాం | 12.16 కోట్లు |
| సీడెడ్ | 8.60 కోట్లు |
| ఉత్తరాంధ్ర | 6.09 కోట్లు |
| గుంటూరు | 4.75 కోట్లు |
| కృష్ణ | 3.37 కోట్లు |
| ఈస్ట్ గోదావారి | 4.06 కోట్లు |
| వెస్ట్ గోదావారి | 3.12 కోట్లు |
| నెల్లూరు | 1.62 కోట్లు |
| మొత్తం | 43.78 కోట్లు |
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు.102 కోట్ల గ్రాస్ ను, రూ.63 కోట్ల షేర్ ను నమోదు చేసిందీ చిత్రం.


