జబర్ధస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమెకు అందిన అరుదైన స్వీట్ ఫోటోతో పాటు ఫన్నీ సందేశం పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో ఓ షోరూమ్ ప్రారంభానికి రష్మిని ఆహ్వానించారు. ఆ షో రూమ్ నిర్వాహకులు రష్మికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు .
తాపేశ్వరం ఖాజాని రష్మికి బహుమతిగా ఇచ్చారు. ఈ స్వీట్ ఎంత స్పెషలో అందరికీ తెలిసిందే. దీన్ని తిందామని నోరు తెరిస్తే రష్మి వల్ల కావట్లేదు. ఎందుకంటే అది రష్మి ముఖం కంటే పెద్దగా ఉంది. ఇంత పెద్ద తాపేశ్వరం ఖాజాని ఇచ్చినందుకు షోరూం యజమానులకు థ్యాంక్స్ చెబుతూ ఈ వీడియోను తన యూట్యూబ్ ఖాతాలో అప్లోడ్ చేసింది. ‘ఈ ఖాజా చూడ్డానికి చాలా బాగుంది. కాకపోతే నా ముఖం కంటే పెద్దగా ఉంది. దీన్ని ఎంతమంది తింటే అయిపోతుందో’.. అని క్యూట్ క్యూట్గా చెప్పిన మాటలు అందరినీ తెగ నవ్విస్తున్నాయి.