17న పూరి – రవితేజల సినిమా ప్రారంభం

17న పూరి – రవితేజల సినిమా ప్రారంభం

Published on Feb 15, 2012 11:53 AM IST


మాస్ మహారాజ రవితేజ మరియు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ఈ నెల 17 న ప్రారంభం కానుంది. పూరి జగన్నాధ్ ఆఫీసులో ఈ చిత్ర ముహూర్తం పూజ కార్యక్రమాలు జరపనున్నట్లు సమాచారం. చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చి 1 నుండి ప్రారంభమవుతుంది. సింగిల్ షెడ్యుల్లో చిత్రాన్ని పూర్తి చేయాలనీ దర్శకుడు భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్ధనున్నట్లు సమాచారం. రఘు కుంచె సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు