‘సమ్మోహనం’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్న ముగ్గురు దర్శకులు !

‘సమ్మోహనం’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్న ముగ్గురు దర్శకులు !

Published on Jun 12, 2018 2:26 PM IST

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు, అదితిరావ్ హైదరి జంటగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. ఒక స్టార్ హీరోయిన్,సాధారణ యువకుడికి మధ్యన జరిగే ప్రేమ కథగా ఈ చికుత్రం ఉండనుంది. అందుకే హీరోయిన్ పాత్ర చిత్రీకరణలో భాగంగా సినిమా షూటింగ్స్ కు సంబందించిన కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయట.

ఈ సన్నివేశాల్లో ముగ్గురు రియల్ లైఫ్ దర్శకులు నటిస్తున్నారు. వాళ్ళే హరీష్ శంకర్, తరుణ్ భాస్కర్, అవసరాల శ్రీనివాస్’. మరి వీరి గెస్ట్ అప్పియరెన్స్ ఎలా ఉంటుందో చూడాలంటే ఈ నెల 15వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ మధ్యే విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘మహానటి’ చిత్రంలో సైతం తరుణ్ భాస్కర్, అవసరాల శ్రీనివాస్, సందీప్ వంగ, క్రిష్ వంటి దర్శకులు అతిధి పాత్రల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు