‘మహానాయకుడు’ వాయిదా నిజమేనా ?

‘మహానాయకుడు’ వాయిదా నిజమేనా ?

Published on Jan 16, 2019 4:07 PM IST

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై, మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను మాత్రం పెద్దగా రాబట్టుకోలేకపోతుంది.

కథానాయకుడు నిరుత్సాహ పరిచకపోయినా.. పూర్తిగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సినిమా మొత్తం స్లో గా సాగడం, ట్రీట్మెంట్ కూడా అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడం వంటి అంశాలు కథానాయకుడు కలెక్షన్స్ పై బాగా ప్రభావం చూపాయి. దాంతో చిత్రబృందం రెండవ పార్ట్ ‘మహానాయకుడు’ ఫై స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ‘మహానాయకుడు’లో లాగ్ లేకుండా.. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను ఇంకా యాడ్ చేయనున్నారని తెలుస్తోంది.

కాగా ఈ కారణాల కారణంగా ‘మహానాయకుడు’ని ఫిబ్రవరి 7న విడుదల చెయ్యడం కష్టమేనని తెలుస్తుంది. అయితే ఈ విడుదల తేదీ మార్పు ఫై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు