నెల్లూర్ సిటీలో ప్రభాస్ ప్రభంజనం

నెల్లూర్ సిటీలో ప్రభాస్ ప్రభంజనం

Published on Sep 2, 2019 4:15 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వసూళ్ల పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో నెల్లూర్ టౌన్ కూడా ఉంది. ఇక్కడ అత్యంత వేగంగా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా ‘సాహో’ ఘనత దక్కించుకుంది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ ‘బాహుబలి 2’ పేరు మీద ఉండేది.

ఇక్కడ ‘బాహుబలి 2’ కోటి గ్రాస్ అందుకోవడానికి దాదాపు 5 రోజులు పట్టగా ‘సాహో’ కేవలం 3 రోజుల్లో రూ.1.34 కోట్ల గ్రాస్ రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఇక షేర్ విషయానికి వస్తే ‘బాహుబలి 2’ మొదటి వారంలో రూ.80 లక్షల షేర్ ఖాతాలో వెసుకోగా ‘సాహో’ కేవలం 3 రోజుల్లో రూ.71.76 లక్షల షేర్ అందుకుని ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వసూళ్లతో జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్ బేస్ గతం కంటే రెట్టింపైందిని స్పష్టంగా తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు