భారీ పారితోషికాన్ని తిరస్కరించిన సాయి పల్లవి !

భారీ పారితోషికాన్ని తిరస్కరించిన సాయి పల్లవి !

Published on Aug 19, 2018 3:05 PM IST

‘ఫిదా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచియమైన హీరోయిన్ గా పరిచియమైంది సాయి పల్లవి. ఈచిత్రం బ్లాక్ బ్లస్టర్ ను సాధించడంలో కీలక పాత్రను పోషించి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ హీరోయిన్ కి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 5వ చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందట. కాకపోతే అది సెకండ్ హీరోయిన్ పాత్రకావటంతో సాయి పల్లవి నో చెప్పిందట.

ఈ పాత్రలో నటిస్తే ఆమెకు 2కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వచ్చిన సాయి పల్లవి కి ఆ పాత్ర నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా ఈ భారీ ఆఫర్ ను తిరస్కరించిందని సమాచారం. ఏమైనా డబ్బుకంటే ఎక్కువగా పాత్రకు ప్రాధాన్యమిస్తూ ఇతర కథానాయికలు కు ఆదర్శంగా నిలుస్తుంది సాయి పల్లవి. ఇక సాయి పల్లవిని తీసుకొని సినిమాకు హైప్ క్రియేట్ చేద్దామనుకున్న చిత్ర టీం ఆశలు ఫలించలేదు. దాంతో ఇప్పుడు ఆ పాత్రకు మెహ్రీన్ ను తీసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు