‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్


అల్లరి నరేష్ హీరోగా ఆనంది హీరోయిన్ గా యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంస్థలపై ఎంతో గ్రాండ్ గా రూపొందిన ఈ మూవీకి ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సంపత్‌ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ మూవీకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ తో పాటు ఫస్ట్ సాంగ్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా ఈ మూవీ నుండి కోలో కోలో కోయిల అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ని నవంబర్ 19న ఉదయం 10 గం. లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. అల్లరి నరేష్ ఎలక్షన్ అధికారిగా పవర్ఫుల్ రోల్ చేసిన ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ మూవీ నవంబర్ 25న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Exit mobile version