ప్రేక్షకులకు కృజ్ఞతలు తెలిపిన డైరెక్టర్ !

ప్రేక్షకులకు కృజ్ఞతలు తెలిపిన డైరెక్టర్ !

Published on Jun 2, 2019 9:38 PM IST

సెల్వరాఘవన్ దర్శకత్వంలో.. సూర్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ – సాయి పల్లవి హీరోయిన్లుగా పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘ఎన్ జీ కే’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ అందించారు. మే 31న విడుదలైన ‘ఎన్ జీ కే’ మంచి ఓపెనింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా …

దర్శకుడు శ్రీ రాఘవ మాట్లాడుతూ, ” సూర్య ఫస్ట్ హాఫ్ లో హీరో, సెకండ్ హాఫ్ లో విలన్ గా కారక్టరైజేషన్ ని డిఫరెంట్ గా చేశాము. అదే ‘ఎన్ జీ కే’ చూసిన ఆడియెన్స్ ని థ్రిల్ అయ్యేలా చేసింది. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి, సూర్య పెర్ఫార్మెన్స్ కి ట్రేమెండస్ అప్లాజ్ రావడానికి ఈ కారక్టరైజేషనే కారణం అయ్యింది. ‘ఎన్ జీ కే’ సాధించిన విజయం అటు సూర్యకి, ఇటు దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ కెరక్టర్లు డిఫరెంట్ గా ఉండడం వల్ల అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యువన్ శంకర్ రాజా రి రికార్డింగ్ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృజ్ఞతలు.” అన్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు