‘వాల్మీకి’లో సుకుమార్ సప్రైజ్

‘వాల్మీకి’లో సుకుమార్ సప్రైజ్

Published on Sep 3, 2019 7:00 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తమిళ సూపర్ హిట్ సినిమా ‘జిగర్తాండ’కు రీమేక్ కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొని ఉంది. అంతేగాక సినిమాను మాస్ జనం మెచ్చేలా అన్ని హంగులతో రూపొందించారట హరీశ్ శంకర్.

ఇక తాజా విషయానికొస్తే హరీశ్ శంకర్ కొద్దిసేపటి క్రితమే దర్శకుడు సుకుమార్ నుండి వాల్మీకిలో ఒక చిన్న సప్రైజ్ అంటూ ట్వీట్ చేశారు. దీన్నిబట్టి సుకుమార్ సినిమాలో కనిపిస్తారని కొందరంటే లేదు వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తారని ఇంకొందరు అంటున్నారు. ఇంతకీ వీటిలో ఏది వాస్తవమో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు