టాక్..”దసరా” మాసివ్ ఈవెంట్ పై సాలిడ్ బజ్.!


ప్రస్తుతం టాలీవుడ్ సహా పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “దసరా”. నాచురల్ స్టార్ నాని నుంచి ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా వస్తుండగా దీనిని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. మరి ఇప్పుడు హీరో హీరోయిన్ కీర్తి సురేష్ ఇతర కీలక వ్యక్తులు అంతా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ ని భుజాలకు ఎత్తుకోగా ఆడియెన్స్ అంతా ఇప్పుడు సినిమా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరి ఈ ఈవెంట్ పై అయితే లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమాకి గెస్టులుగా ఊహించని వ్యక్తులే దగ్గరగా ముగ్గురు నలుగురు హాజరు కావడమా లేదా జస్ట్ సోలో ప్రీ రిలీజ్ లా గాని జరిగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వీటిపై మరికొన్ని రోజుల్లో అధికారిక అనౌన్సమెంట్స్ రానున్నాయి. అలాగే ఈ మార్చ్ 25 లేదా 26న అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version