అమ్మ శ్రీదేవి ఎదురుగా జాన్వీ కపూర్.

అమ్మ శ్రీదేవి ఎదురుగా జాన్వీ కపూర్.

Published on Sep 4, 2019 1:16 PM IST

నటి శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్ నందు గల ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నేడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో శ్రీదేవి కుటుంబ సభ్యులైన భర్త బోని కపూర్, కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ మరియు నటి మహేశ్వరి పాల్గొనడం జరిగింది. బంగారు వన్నె వస్త్రాలలో, కిరీటం ధరించి ఉన్న శ్రీదేవి విగ్రహం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా శ్రీదేవి కళ్ళు చూస్తుంటే ఆమె విగ్రహమా లేక, మనీషా అన్నంత సహజంగా ఉన్నారు. మొత్తంగా శ్రీదేవి మైనపు విగ్రహం నిజంగా దేవకన్యలా, సజీవ శిల్పంగా ఉంది.

ఐతే అమ్మ శ్రీదేవి మైనపు విగ్రహాన్ని అలాగే తదేకంగా చూస్తున్న జాన్వీ ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఆ ఫోటో చూస్తుంటే జాన్వీ, శ్రీదేవి ఒకరినొకరు చేసుకున్నట్లుగా సహజంగా ఆశ్చర్యం గొలిపేలా ఉంది. శ్రీదేవి ఇద్దరు కుమార్తెలలో పెద్దదైన జాన్వీ అచ్చు శ్రీదేవిలా ఉంటారు. శ్రీదేవి జాన్విని వెండితెరపై చూడాలని, టాప్ స్టార్ గా జాన్వీ కెరీర్ కు బాటలు వేయాలని చాలా ఆశపడ్డారు. దురదృష్టవశాత్తు జాన్వీ మొదటి చిత్రం ధఢక్ విడుదలకు ముందే ఆమె కన్నుమూశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు