నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం.

నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం.

Published on Sep 2, 2019 2:42 PM IST

ఇటీవల దివంగత నటి శ్రీదేవి జయంతిని పురస్కరించుకొని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ మ్యూజియం ప్రతినిధులు ప్రకటించడం జరిగింది. శ్రీదేవి మైనపు విగ్రహ తయారీ పూర్తికావడంతో ఆ విగ్రహ ప్రారంభ తేదీని ప్రకటించడం జరిగింది. ఈనెల 3వ తేదీన సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహం లాంచ్ చేయనున్నట్లు మ్యూజియం ప్రతినిధులు తెలియజేశారు.

దశాబ్దాలపాటు ఆమె చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ఆమె విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్ నుండి అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్, మాధురి దీక్షిత్ ఇలా అనేక మంది మైనపు విగ్రహాలను మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. టాలీవుడ్ నుండి మాత్రం కేవలం మహేష్, ప్రభాస్ మాత్రమే ఈ అరుదైన గౌరవం అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు