SSMB 29 : మహేష్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్

SSMB 29 : మహేష్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్

Published on Mar 5, 2024 1:01 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 గ్రాండ్ గా లాంచ్ కానున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఈ క్రేజీ ప్రాజక్ట్ ఎప్పుడు బిగిన్ అవుతుందా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ క్రేజీ న్యూస్ ఒకటి మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ మూవీ కోసం మహేష్ బాబు పై తాజాగా దర్శకుడు జక్కన్న ఒక లుక్ టెస్ట్ నిర్వహించి మొత్తంగా 8 లుక్స్ ని ఫైనలైజ్ చేశారట. కాగా అవన్నీ అదిరిపోయినట్లు చెప్తున్నారు. ఇక ఈ మూవీలో మహేష్ క్యారెక్టర్ ఆయన ఫ్యాన్స్ కి ఫుల్ ఐ ఫీస్ట్ ని అందించడం ఖాయం అని టాక్.

ఓవైపు మహేష్ బాబు ఈ మూవీ కోసం పూర్తిగా క్రాఫ్, గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలో ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ ప్రాజక్ట్ పక్కాగా ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు