చరణ్‌తో సినిమా.. అందుకే ఆగిందన్న సుజీత్

sujithee ram charan

‘ఓజీ’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చివరి నిమిషం వరకు బిజీగా ఉన్నందున, దర్శకుడు సుజీత్ ప్రమోషన్లలో పాల్గొనలేకపోయారు. ఇప్పుడు మాత్రం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సాహో తర్వాత రామ్ చరణ్ గారితో సినిమా చేయాలని ప్లాన్ చేశాను. యూకే నేపథ్యంలో కథ సిద్ధం చేశాం. అయితే కోవిడ్ సమయంలో విదేశాల్లో షూటింగ్ సాధ్యం కాదన్న వాదనల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది” అని తెలిపారు.

ఓజీ తర్వాత సుజీత్, నేచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘ది ప్యారడైస్’ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.

Exit mobile version