“ప్రసన్నవదనం” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సుకుమార్!


అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ తరువాత టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహస్ తదుపరి ప్రసన్నవదనం చిత్రం లో కనిపించనున్నారు. మే 3, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ మరియు రాశి సింగ్ మహిళా కథానాయికలుగా నటించారు మరియు అర్జున్ YK ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

తాజా సమాచారం ఏంటంటే, ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని దస్పల్లా కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో నిమగ్నమై ఉన్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత మరియు కుశాలిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ జెఎస్ మరియు ప్రసాద్ రెడ్డి టిఆర్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version