ఓటిటి పార్ట్నర్ ను లాక్ చేసుకున్న ‘వీర భద్రుడు’!

ఓటిటి పార్ట్నర్ ను లాక్ చేసుకున్న ‘వీర భద్రుడు’!

Published on May 16, 2026 12:00 PM IST

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా చాలా కాలం తర్వాత కలిసి నటించిన సినిమానే “వీర భద్రుడు”. తమిళ్ లో “కరుప్పు” గా తెరకెక్కి పలు వాయిదాలు తర్వాత ఎట్టకేలకి నిన్న శుక్రవారం థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. అయితే ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి దర్శకుడు ఆర్జే బాలాజీ ఫైనల్ గా సాలిడ్ ట్రీట్ ని అందించాడు.

దీంతో భారీ బుకింగ్స్ ని డే కి ఈ సినిమా నమోదు చేసింది. ఇక థియేటర్స్ లో రెస్పాన్స్ ఇలా ఉంటే పోస్ట్ థియేట్రికల్ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో సినిమా సందడి చేయనుందో లాక్ అయ్యింది. ఈ చిత్రాన్ని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. సో థియేటర్స్ లో రిలీజ్ తర్వాత ఈ చిత్రం అందులో సందడి చేయనుంది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందించగా డ్రీం వారియర్ పిక్చర్స్ వారు సాలిడ్ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు