జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలె విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ లభించాయి.
ఈ సందర్బంగా.. ప్రొడ్యూసర్ లక్ష్మీ మాట్లాడుతూ… మా సినిమాకి మొదటి నుంచి కూడా మీడియా చాలా సపోర్ట్ చేసింది. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నెల 31వ తేదీన తెలుగు, కన్నడలో విడుదలవుతుంది. గతంలో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు విడుదలైన మరో ట్రైలర్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగానే ఖర్చు అయింది. అయినా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది అన్నారు.