టాక్ : ‘అనిమల్’ ఓటిటి రిలీజ్ ఆలస్యం కానుందా ?

టాక్ : ‘అనిమల్’ ఓటిటి రిలీజ్ ఆలస్యం కానుందా ?

Published on Jan 20, 2024 3:01 AM IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందున్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ అనిమల్. డిసెంబర్ 1న మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది అనిమల్ మూవీ. భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్, టి సిరీస్ సంస్థలు కలిసి పాన్ ఇండియన్ రేంజ్ లో దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. విషయం ఏమిటంటే, మూవీకి కో ప్రొడ్యూసర్స్ అయిన సినీ వన్ స్టూడియోస్ వారు ఆనిమల్ యొక్క డిజిటల్ పార్ట్ నర్ అయిన నెట్ ఫ్లిక్స్మరియు టి సిరీస్ వారిపై ఇటీవల కోర్ట్ లో ఒక సూట్ ఫైల్ చేసారు.

మొదట ఒప్పుకున్న విధంగా లాభాల్లో 35% శాతం వాటా రావాల్సి ఉండగా అది తమకు ఇవ్వలేదని అందువలన మూవీ యొక్క ఓటిటి రిలీజ్ ఆపేయాలని వారు కోరారు. అయితే వారికి రూ. 2.6 కోట్లు చెల్లించినట్లు టి సిరీస్ వారు వాదించారు. కాగా ఫిర్యాదుదారు యొక్క ఆ చెల్లింపు మోసపూరితమైనదని రుజువు చేసే పత్రాలను కోర్ట్ కి సమర్పించారు సినీ వన్ స్టూడియోస్ వారు. కాగా ఈ రోజు వాది చేసిన ఆరోపణలపై స్పందించడానికి టి సిరీస్ మరియు నెట్‌ఫ్లిక్స్ ఇండియాలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ప్రతివాదులు (టి – సిరీస్ మరియు నెట్‌ఫ్లిక్స్) వారి అఫిడవిట్‌లను సమర్పించడానికి సమయం ఇవ్వబడుతుంది.

అలాగే, వారి నుంచి అఫిడవిట్లను స్వీకరించిన 15 రోజుల్లోగా ప్రతిని దాఖలు చేసేందుకు సినీ స్టూడియోస్ 1కి కోర్టు స్వేచ్ఛను ఇచ్చింది. జనవరి 20లోగా తమ ప్రత్యుత్తరాలు దాఖలు చేయాలని బెంచ్ పార్టీలను ఆదేశించింది. అలానే తదుపరి విచారణ జనవరి 22 కి షెడ్యూల్ చేయబడింది. మరోవైపు ఆనిమల్ యొక్క డిజిటల్ రిలీజ్ జనవరి 26న ప్లాన్ చేయాలని భావించారు, కానీ ఇప్పుడు అది కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటుంది. కాగా ఈ పరిస్థితులు మొత్తం చూస్తుంటే ఇది తేలడానికి మరిన్ని రోజులు సమయం పట్టె అవకాశం లేకపోలేదని అంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. కాగా దీని పై రాబోయే రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు