ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ !

ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ !

Published on Jun 9, 2018 2:27 PM IST


నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘నా నువ్వే’ విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈ గురువారం సినిమా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగంవంతం చేసింది. వాటిలో భాగంగానే ఈ నెల 11న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కళ్యాణ్ రామ్ సోదరుడు , స్టార్ హీరో తారక్ హారాజరుకానున్నారని వినికిడి.

అయితే యూనిట్ సభ్యల నుండి ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయకిగా నటించగా ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాకి మంచి పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి షరత్ సంగీతం అందించగా పిసి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు