“పుష్ఫ” మానియా.. శ్రీవల్లి పాటకు టీమిండియా క్రికెటర్ల స్టెప్పులు..!

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం “పుష్ప”. డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని భారీ వసూళ్లను రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే రోజులు గడుస్తున్నా పుష్ప మానియా మాత్రం ఇంకా తగ్గడం లేదు.

ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ కాగా, ముఖ్యంగా శ్రీవల్లి అనే పాటకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పాటకు లెక్కలేనన్ని రీల్స్ చేశారు. అయితే తాజాగా ఈ పాటకు టీమిండియా క్రికెటర్లు డ్యాన్స్ చేశారు. ఈ పాటలో అల్లు అర్జున్ ఓ స్టెప్పు వేస్తున్నప్పుడు చెప్పు జారిపోతుంది. ఇప్పుడదే స్టెప్పును టీమిండియా ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ చేస్తూ అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version