ఈ మూడు సినిమాలతో కంపించనున్న ఇండియన్ బాక్సాఫీస్.!

ఈ మూడు సినిమాలతో కంపించనున్న ఇండియన్ బాక్సాఫీస్.!

Published on Feb 14, 2021 11:34 AM IST

ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ అంతా సౌత్ ఇండియన్ సినిమా హవా నడుస్తుంది అని చెప్పాలి. బాహుబలి సినిమాల సెన్సేషన్ నుంచి దాదాపు కాస్త భారీగా ప్లాన్ చేసే ప్రతీ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో ఏదొకలా విడుదల అవుతుంది. మరి ఓ మూడు సినిమాలతో మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ మరోసారి రగిలిపోవడం ఖాయం అని చెప్పాలి ఇప్పుడు.

లేటెస్ట్ హా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “రాధే శ్యామ్” చిత్రం విడుదల తేదీ ప్రకటించడంతో ఈ భీకర యుద్ధం ఖరారు అయ్యింది. మొదటగా జూలై నెలలో మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2” 16వ తేదీన ప్రపంచ వ్యాప్యంగా భారీ ఎత్తున విడుదలకు డేట్ ను లాక్ చేసుకోగా “రాధే శ్యామ్” ఆ రెండు వారాల గ్యాప్ లోనే జూలై 30న డేట్ లాక్ చేసుకుంది.

మరి ఈ రెండింటితో పాటుగా అంతే రెండు వారాల గ్యాప్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొట్ట మొదటిసారి పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న భారీ చిత్రం “పుష్ప” ఆగష్టు 13న విడుదల కానుంది. బన్నీ మొదటి పాన్ ఇండియన్ సినిమా అయినా కూడా దీనిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మొత్తానికి మాత్రం ఈ మూడు సినిమాలూ ఇండియన్ బాక్సాఫీస్ ను కంపించడం ఖాయం. మరి ఆ టైం వచ్చే సరికి మాస్ హిస్టీరియా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు