టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన సంపత్ నంది తెరకెక్కించిన చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన “రచ్చ” కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నాతో ఇపుడు సోలోగా ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ని అయితే చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రమే “ఓదెల 2”. మరి ఈ సినిమాలో తమన్నా ఒక అఘోరి పాత్రలో కనిపిస్తుండగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ని మహా కుంభమేళాలో విడుదల చేస్తున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు.
అయితే ఇపుడు దీనికి టైం లాక్ అయ్యింది. కుంభమేళా లోనే ఒక 102 ఏళ్ల నాగ సాధుతో ఈ టీజర్ ని మేకర్స్ ఈ ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల 25 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా లాక్ చేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా మధు క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే త్వరలోనే నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Here's a prelude into the world of #Odela2 ❤️????
Let the Chants Begin.#Odela2Teaser out tomorrow at 11:25 AM ????
Teaser launch at the Maha Khumb Mela in Prayagraj by a 108 year old Naga Sadhu ✨#Odela2 Soon in cinemas nationwide @tamannaahspeaks… pic.twitter.com/GSNZCVPSha
— Sampath Nandi Team Works (@SampathNandi_TW) February 21, 2025