సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’ !

సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’ !

Published on Sep 4, 2019 2:30 PM IST

నవీన్ నాయని దర్శకత్వంలో తరుణ్ తేజ్ ,లావణ్య హీరోహీరోయిన్లుగా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ రాబోతున్న సినిమా ‘ఉండి పోరాదే’. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకం పై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగల్ కట్ కూడా లేకుండా యూ/ ఏ సర్టిఫికెట్ పొందింది. సెప్టెంబర్ 6న గ్రాండ్ గా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ” మా ‘ఉండి పోరాదే’ చిత్రానికి సెన్సార్ వారు సింగల్ కట్ కూడా లేకుండా యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఫ్యామిలీకి సంబంధించి ఒక అద్భుత‌మైన క‌థాంశంలో ద‌ర్శ‌కుడు న‌వీన్ ప్ర‌తి ఫ్రేమ్ ఒక ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్ట‌ర్ లాగా తీశారు. హీరోహీరోయిన్లు తరుణ్ తేజ్, లావణ్య వారి కోస‌మే ఈ సినిమా పుట్టిందా? అనేంత‌ పోటా పోటిగా న‌టించారు. ఈ సినిమాలో న‌టించిన అంద‌రి కెరీర్లో ఇది బెస్ట్ మూవిగా నిలిచిపోతుంది అనే నమ్మకం ఉంది. సెప్టెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అంద‌రూ థియేటర్ లో సినిమా చూసి పెద్ద స‌క్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నారు.

తరుణ్ తేజ్ ,లావణ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, ఎడిటర్: జె.పి, మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యెలెందర్ మహావీర్, నిర్మాత : డా. కె. లింగేశ్వర్: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ నాయని.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు