తెలుగు రాష్ట్రాల్లో కూడా హవా కొనసాగిస్తున్న బాలీవుడ్ చిత్రం !

2016 లో భారత సైన్యం పాక్ మిలిటెంట్ల ఫై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ను బేస్ చేసుకొని తెరకెక్కిన చిత్రం’యూరి : ది సర్జికల్ స్ట్రైక్’. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఇప్పటివరకు 222కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని కేవలం హిందీ భాషలోనే విడుదలచేశారు అయినా కాని సౌత్ లోకూడా మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. ముఖ్యంగా నైజాం & ఏపీ లో నిన్నటి వరకు ఈ చిత్రం 11.56 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక అలాగే కేరళలో 2.24 , తమిళనాడులో 2.47 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికి ముంబై లోని కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది.

విక్కీ కౌషల్ , యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రివెలా నిర్మించారు. ఇక ఈ ఏడాది బాలీవుడ్ కు బాగా కలిసొచ్చేలానే ఉంది. ఇప్పటికే విడుదలైన యూరి , మణికర్ణిక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగా తాజాగా విడుదలైన గల్లీబాయ్ కూడా సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతుంది.

Exit mobile version