తమిళ భాషలో ప్రస్తుతం అరడజను చిత్రాలలో నటిస్తు తీరిక లేకుండా గడుపుతున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవల హీరోయిన్ గా మాత్రమే కాకుండా విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఒకే చిత్రంలో వేరే హీరోయిన్ తో కలిసి నటిస్తున్నపుడు ఆమెను ఎక్కువ సన్నివేశాలలో చూపించిన నేను బాధ పడను. నా పాత్రకు తగ్గ న్యాయం చేశాన లేదా అని మాత్రమే ఆలోచిస్తా. నేను ఎవరిని చూసి అసూయపడను. ఎందుకంటే నేను ఎవరిని పోటీ కింద భావించను . నాతో కలిసి నటించే హీరోయిన్ ను ఫ్రెండ్ గానే చూస్తానాని అన్నారు.


