పి.ఎస్.రామనాథ్ దర్శకత్వంలో జీవా, నయనతార హీరోహీరోయిన్స్ గా రూపొందిన ‘తిరునాళ్’ సినిమా, ‘వీడే సరైనోడు’ అనే టైటిల్ తో తెలుగులో రాబోతుంది. కోకా శిరీష సమ్పణలో నోవా సినిమాస్ పతాకం పై నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ సినిమాని సెప్టెంబర్ 6వ తేదీన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని అందుకే ఈ సినిమాని తెలుగులోకి తీసుకువస్తున్నారని తెలుస్తోంది.
పైగా నయనతార, జీవా కాంబినేషన్ లో సినిమా కావడంతో.. నయనతారకి ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మాత ఈ సినిమాని కొన్నారట. మరి మంచి కథాంశంతో రూపొందిన ఈ చిత్రం, నిర్మాత జక్కుల నాగేశ్వరరావుకి హిట్ ని ఇస్తోందేమో చూడాలి. ఇక జక్కుల నాగేశ్వరరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘‘యాక్షన్ డ్రామా థ్రిల్లర్ ఇది. జీవా, నయనతార నటన మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుందని అని అన్నారు.