విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రణబాలి’ అనంతపూర్ షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతపూర్ షూటింగ్ సమయంలో విజయ్, రష్మికలకు స్థానిక అభిమానుల నుండి అపూర్వ స్పందన లభించింది. అభిమానులు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించడమే కాకుండా, విజయ్ ప్రత్యేకంగా రాయలసీమ ఫ్యాన్స్తో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి రావడం తన సొంత ఊరికి వచ్చిన అనుభూతిని కలిగిస్తుందని భావోద్వేగానికి లోనయ్యాడు.
ఈ సినిమా 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన కాలంలో (1854 – 1878) జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందుతోంది. విజయ్ దేవరకొండ ఇందులో ‘రణబాలి’ అనే పవర్ఫుల్ యోధుడి పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే పాత్రను పోషిస్తుంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్గా వస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటించడం విశేషం. చారిత్రక నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా విజువల్స్ అందిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ వార్ డ్రామా విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
