ముంబైలో దర్శనమిచ్చిన విజయ్,రష్మికల జంట

ముంబైలో దర్శనమిచ్చిన విజయ్,రష్మికల జంట

Published on Sep 4, 2019 8:23 AM IST

హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ల జంట నిన్న సాయంత్రం ముంబైలో మెరిశారు. ఓ కార్యక్రమంలో భాగంగా వీరు నిన్న ముంబైలో సందడి చేశారు. వివరాలలోకి వెళితే పివిఆర్ సినిమాస్, ఫిల్మ్ కంపాషన్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థలు నిన్న డియర్ కామ్రేడ్ చిత్ర ప్రత్యేక ప్రదర్శన ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు చిత్ర హీరోహీరోయిన్లు అయిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందాన పాల్గొన్నారు. అలాగే వీరిద్దరూ అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది.

తెలుగుతో పాటు, తమిళ,కన్నడ, మలయాళ భాషలలో భారీ అంచనాల మధ్య విడుదలైన డియర్ కామ్రేడ్ ఆ అంచనాలు అందుకోవడంలో విఫలం చెందింది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు