బెల్లంకొండ సినిమా కోసం వినాయక్ కి భారీ పారితోషికం

బెల్లంకొండ సినిమా కోసం వినాయక్ కి భారీ పారితోషికం

Published on Mar 11, 2013 4:20 PM IST

vv-vinayak

మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో పేరు తెచ్చుకున్నడైరెక్టర్ వి.వి.వినాయక్ . తను ప్రస్తుతం ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడి సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. మేము విన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 10కోట్ల రూపాయలు పారితోషికం తీసుకోనున్నాడు . బెల్లంకొండ సురేష్ తన కుమారుడి మొదటి సినిమా విషయంలో ఏ ఆవకాశాన్ని వదలడంలేదు, అలాగే ఖర్చుకి వెనుకాడడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నాడు. కామెడీ, యాక్షన్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుంది. డైరెక్టర్ వి.వి.వినాయక్ చివరిగా సూపర్ హిట్ సినిమా ‘నాయక్’ కి దర్శకత్వం వహించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు