స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదలకానున్న ‘విశ్వరూపం-2’ !

స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదలకానున్న ‘విశ్వరూపం-2’ !

Published on Jun 11, 2018 8:24 AM IST

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విశ్వరూపం-2’. 2013లో వచ్చిన ‘వివస్వరూపం-2’ చిత్రానికిఒ కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. టెర్రరిజం నేపథ్యంలో ఉండబోయే ఈ సినిమాలో కమల్ నటించడమేగాక స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించారు కూడ. తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలచేయాలని నిర్ణయించారు కమల్.

ఇక ఈ చిత్ర ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెలుగులో తారక్, తమిళంలో శృతి హాసన్, హిందీలో అమీర్ ఖాన్ లు విడుదలచేస్తున్నారు. ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ వంటివారు నటించారు. మొదటి భాగం మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు, కమల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు