జీరో కట్స్ తో సెన్సార్ పూర్తిచేసుకున్న ‘భరత్ అనే నేను’ !

జీరో కట్స్ తో సెన్సార్ పూర్తిచేసుకున్న ‘భరత్ అనే నేను’ !

Published on Apr 16, 2018 3:08 PM IST


మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఈ నెల 20న విడుదలకానుండగా చిత్రం కొద్దిసేపటి క్రితమే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది. చిత్రం రాజకీయ నైపథ్యంలో సాగేది కావడం, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు వేడి మీదుండటంతో సినిమా పట్ల సెన్సార్ సభ్యులు ఏమంటారో చూడాలని ప్రేక్షకుల్లో ఉత్సుకత నెలకొంది.

ఈ నైపథ్యంలో సెన్సార్ బోర్డు చిత్రానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా జీరో కట్స్ తో U/A సర్టిఫికేట్ ను జారీ చేసింది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. సామాజిక సందేశాల్ని కమర్షియల్ అంశాలతో మిక్స్ చేసి సినిమాలు చేసే దర్శకుడు కొరటాల శివ గత చిత్రాలు ‘మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్’ మూడు భారీ హిట్లుగా నిలవడంతో ఈ నెల 20న విడుదలకానున్న ఈ చిత్రం కూడ అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు