బిగ్ బాస్ చివరి దశకు చేరింది కేవలం ఇంకా కొద్దిరోజులలో విన్నర్ ఎవరో తేలిపోనున్నారు. బిగ్ బాస్ ఇస్తున్న కఠినమైన టాస్కులను కూడా ఛాలెంజ్ తీసుకొని కంటెస్టెంట్స్ గెలుపు కోసం చమటోడ్చుతున్నారు. ఐతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఒకరికి సప్పోర్ట్ గా యాక్ట్రెస్ కమ్ జబర్ధస్త్ యాంకర్ రష్మీ రంగంలోకి దిగింది. ఎలాగైనా తనని గెలిపించాలని వేడుకొంటుంది. ఇంతకీ ఆమె ఎవరి కొరకు అంతలా ప్రేక్షకులను వేడుకుంటుంది అంటే… తోటి యాంకర్ శ్రీముఖి కోసం.
శ్రీముఖి నాకు చాలా బాగా తెలుసు, ఆమె పైకి కనిపించేంత అల్లరి పిల్ల కాదు, చాలా మంచి అమ్మాయి. బిగ్ బాస్ చివరి దశకు చేరింది, తాను గెలవాలంటే మీ ఓట్లు చాలా అవసరం…, అని ఒక వీడియో పోస్ట్ చేసింది రష్మీ. ఒక యాంకర్ గా తోటి యాంకర్ గెలవాలని, గెలిపించమని రష్మీ పడుతున్న తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది. టైటిల్ విన్నర్స్ లో శ్రీముఖి ఫేవరేట్ గా ఉన్నారు. వరుణ్, రాహుల్, బాబా భాస్కర్ ఆమెకు గట్టిపోటీ ఇస్తున్నారు. మరి రష్మీ మనవి మన్నించి ప్రేక్షకులు శ్రీముఖిని గెలిపిస్తారో లేదో.
Such a lovely words from #RashmiGautam. Thank You So much for your support ????????#WeSupportSreemukhi
????Give a (50) Missed Calls to 8466996713
&
Login to #Hotstar app and cast your (10) votes to #Sreemukhi.#biggbosstelugu3 #Ramulamma #BB3 #StarMaa #AllRounder #Energetic pic.twitter.com/0LzXa8bq2Q— SreeMukhi (@MukhiSree) October 23, 2019