డిసెంబర్ 9నుంచి థియేటర్లలో డబుల్ ‘మెగా సౌండ్’!

డిసెంబర్ 9నుంచి థియేటర్లలో డబుల్ ‘మెగా సౌండ్’!

Published on Dec 5, 2016 1:26 PM IST

khaiid-dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులను అలరించేందుకు ఈనెల 9న ‘ధృవ’ సినిమాతో వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్ కూడా అదరగొట్టడంతో సినిమా కూడా ఎక్కడా తగ్గకుండా ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ధృవ విడుదల రోజున థియేటర్లలో మెగా అభిమానులకు రామ్ చరణ్‌తో పాటు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని కూడా చూసే అవకాశం దక్కుతుండడం విశేషంగా చెప్పుకోవాలి.

చిరంజీవి చాలాకాలం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీ నెం. 150’ సంక్రాంతికి విడుదల కానుండగా, డిసెంబర్ 8న ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇక ఆ తర్వాత రోజునుంచి ధృవ విడుదలవుతోన్న అన్ని థియేటర్లలో ‘ఖైదీ నెం. 150’ టీజర్‌ను ప్రదర్శిస్తారట. ఇటు చరణ్ సినిమాతో పాటు, అటు చిరు టీజర్ కూడా కలిసి థియేటర్లలో మెగా సౌండ్ దద్దరిల్లిపోతుందనే చెప్పొచ్చు. ‘ఖైదీ నెం. 150’ టీజర్‌ను రామ్ చరణ్ దగ్గరుండి కట్ చేయించారట. వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెం. 150’ రూపొందుతూ ఉండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ తెరకెక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు