నైజాంలో ‘గ్యాంగ్ లీడర్’ పడిపోయాడు !

నైజాంలో ‘గ్యాంగ్ లీడర్’ పడిపోయాడు !

Published on Sep 19, 2019 2:21 PM IST

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌ లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. కాగా ఈ సినిమా ఫస్ట్ డే నుండి బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కోసం పోరాడుతోంది. అయితే మొదటి వారంలో డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టినా.. వారాంతంలో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ బాగా పడిపోయాయి, ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ కి వస్తోన్న కలెక్షన్స్ పంపిణీదారులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా నైజాం కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో, 6వ రోజుకు గానూ.. ఈ చిత్రం రూ .33 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మొత్తం ఈ చిత్రం ఆరు రోజులకు గానూ నైజాంలో రూ .5.66 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే గ్యాంగ్ లీడర్‌ ను నైజాం పంపిణీదారుడికి దాదాపు రూ .8 కోట్లకు విక్రయించారు. దీని బట్టి గ్యాంగ్ లీడర్ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. రేపు వరుణ్ తేజ్ వాల్మీకి రిలీజ్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే గ్యాంగ్ లీడర్ వాల్మీకిని తట్టుకుని నిలబడాలి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో చూడలి. అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో ఈ సినిమాతో బాగానే ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు