ఐడ్రీం ద్వారా ఓవర్సీస్ లో రిలీజ్ కానున్న ‘లౌక్యం’

ఐడ్రీం ద్వారా ఓవర్సీస్ లో రిలీజ్ కానున్న ‘లౌక్యం’

Published on Sep 20, 2014 11:30 AM IST

Loukyam
టాలీవుడ్ యాక్షన్ హీరోస్ లో ఒకరైన గోపీచంద్ హీరోగా నటించిన సినిమా ‘లౌక్యం’. ఈ సినిమాని సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు ఈ చిత్ర టీం మరోసారి ఖరారు చేసారు. గోపీచంద్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీ వాస్ డైరెక్టర్.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని యుఎస్, గల్ఫ్, యుకె, సింగపూర్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో ఐడ్రీం మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.

సోమవారం నుంచి ఈ చిత్ర టీం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టనుంది. ‘లక్ష్యం’ సినిమా తర్వాత గోపీచంద్ – శ్రీ వాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కూడా వారి గత సినిమాలానే హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హంసా నందిని ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు