ఫిబ్రవరి నుండి మొదలు కానున్న భారి మల్టిస్టారర్ !

ఫిబ్రవరి నుండి మొదలు కానున్న భారి మల్టిస్టారర్ !

Published on Dec 16, 2017 10:33 AM IST

తెలుగులో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. నాగార్జున, నాని కలసి ఈ సినిమాలో నటించబోతున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అస్వినిదత్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

గతంలో నాగార్జున గోవిందా గోవిందా, రావోయి చందమామ. ఆజాద్ వంటి సినిమాలు వైజయంతి మూవీస్ లో చేసారు. చాలా గ్యాప్ తరువాత మళ్ళి నాగార్జున బ్యానర్ లో వర్క్ చెయ్యడం విశేషం. నాని నటించిన ఎంసిఎ సినిమా ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తరువాత నాని నటించబోయే సినిమా మల్టి స్టారర్. నాగార్జున నాని కాంబినేషన్ అంటే సినీ జనాల్లో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు