డైన్ విత్ స్టార్స్ కి హోస్ట్ గా వ్యవహరించనున్న నవదీప్

డైన్ విత్ స్టార్స్ కి హోస్ట్ గా వ్యవహరించనున్న నవదీప్

Published on Nov 25, 2014 10:22 PM IST

Navdeep-
నవంబర్ 30న టాలీవుడ్ అంతా కలిసి చేస్తున్న టెలీథాన్ ప్రోగ్రాం ‘మేము సైతం’ గురించి ప్రతి రోజూ స్పెషల్ న్యూస్ అందిస్తున్నాం.. నవంబర్ 30న మాత్రమే కాకుండా నవంబర్ 29న చేసే డైన్ విత్ స్టార్స్ వేడుక కూడా ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోస్, హీరోయిన్స్ హాజరవుతున్నారు. ఈ వేడుకలో మీరు స్టార్స్ తో కలిసి డిన్నర్ చేసే టైంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ డైన్ విత్ స్టార్స్ వేడుకకి హోస్ట్ గా యంగ్ హీరో నవదీప్ వ్యవహరించనున్నాడు. అలాగే ఫేమస్ బాలీవుడ్ సింగర్ షిబాని కశ్యప్ కూడా తన లైవ్ సింగింగ్ తో అక్కడి స్టార్స్ మరియు గెస్ట్ లను ఆకట్టుకోనున్నాడు. వీరు మాత్రమె కాకుండా యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ కూడా తన రాక్ బ్యాండ్ తో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నాడు. ఈ డైన్ విత్ స్టార్స్ ఈవెంట్ కి 250 కపుల్స్ కి ఎంట్రీ ఉంటుంది. ఒక్కో కపుల్ ఎంట్రీ టికెట్ ధర లక్ష రూపాయలు. ఈ మేము సైతం ద్వారా వచ్చే మొత్తం మనీని హుదూద్ బాధితుల సహాయార్ధం ఏపి సిఎం రిలీఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు