ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన నిఖిల్ యూనిట్ !

ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన నిఖిల్ యూనిట్ !

Published on Jan 22, 2018 6:56 PM IST

ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నిఖిల్ చేస్తున్న సినిమా కిరాక్ పార్టీ. కన్నడలో మంచి విజయం సాదించిన కిరాక్ పార్టీకి ఈ సినిమా రీమేక్. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అంజనేష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాలేజ్ క్యాంపస్ లో జరిగే రాజకీయాలు ఎలా ఉండబోతున్నయనే విషయాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను కేక్ కట్ చేసి లాంచ్ చేసారు. సంయుక్తా హెగ్డే ఇంకా సిమ్రాన్ పరీన్జా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా యూత్ ను అలరిస్తుందని చెపుతున్నారు. టాకీ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు