ఈ నెల 25 నుంచి ఎన్.టి.ఆర్ మూవీ గోవా షూటింగ్

ఈ నెల 25 నుంచి ఎన్.టి.ఆర్ మూవీ గోవా షూటింగ్

Published on Oct 23, 2014 9:24 AM IST

ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ నెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ గోవాలో మొదలు కావాల్సి ఉంది. కానీ దాదాపు 12 రోజులు వర్కర్స్ యూనియన్ చేసిన స్ట్రైక్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. దాంతో ఈ చిత్ర టీం హైదరాబాద్ కి వచ్చేశారు. నిన్నటితో వర్కర్స్ యూనియన్ స్ట్రైక్ ముగియడంతో నేటి నుంచి అన్ని షూటింగ్స్ తిరిగి మొదలు కానున్నాయి.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ నెల 25 నుంచి ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ ల గోవా షెడ్యూల్ మొదలు కానుంది. ఈ చిత్ర టీం అంతా దీపావళి జరుపుకొని 25వ తేదీకల్లా గోవా చేరుకొని షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీం అనుకున్న రిలీజ్ తేదీకి తక్కువ టైం ఉండడంతో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఈ స్ట్రైక్ వల్ల వచ్చిన 5 రోజుల గ్యాప్ ని ని కూడా డే అండ్ నైట్ షూట్ చేసి కవర్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు