‘ ఆంధ్రా పోరి ‘తో హీరోగా వస్తున్న పూరి తనయుడు.

‘ ఆంధ్రా పోరి ‘తో హీరోగా వస్తున్న పూరి తనయుడు.

Published on Dec 18, 2014 12:19 PM IST

akash-puri
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ లో జరిగింది. ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘రుషి’ ఫేం రాజ్ ముదిరాజ్ దర్శకుడు. ప్రసాద్ లాబ్స్ లో జరిగిన పూజా కార్యక్రమాలకు యూనిట్ సభ్యులతో పాటు పూరి జగన్నాధ్ దంపతులు హాజరయ్యారు.

టీనేజ్ ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న ‘ ఆంధ్రా పోరి ‘ అనే టైటిల్ ఖరారు చేశారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘టైంపాస్’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆకాష్ సరసన ఉల్క గుప్తా హీరోయిన్ గా నటిస్తుంది. జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

‘గబ్బర్ సింగ్’, ‘బుజ్జుగాడు మేడ్ ఇన్ చెన్నై’, ‘ధోని’ సినిమాలతో బాల నటుడిగా కనిపించిన ఆకాష్, తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఫుల్ లెంత్ హీరోగా ఇదే తొలి సినిమా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు