పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరో పాత్రతో పాటు విలన్ పాత్రకూ వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలను ప్రతీ సినిమాలో కొత్తగా చూపించే పూరీ, విలన్ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్లే ఆయన దర్శకత్వంలో పాపులర్ అయిన పలువురు విలన్స్, ఆ తర్వాత ఇండస్ట్రీలో టాప్ విలన్స్గా దూసుకుపోయారు. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన ‘జ్యోతిలక్ష్మి’ అన్న సినిమాతో అజయ్ ఘోష్ అనే కొత్త విలన్ తెలుగులో వెలుగులోకి వచ్చారు.
‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో నారాయణ్ పట్వారీ అన్న పాత్రలో నటించిన అజయ్ ఘోష్కు, ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. పూరీ రాసిన డైలాగ్స్ ఈ పాత్రకు ఓ మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ‘జ్యోతిలక్ష్మి’లో విలన్గా మెప్పించిన అకయ్, ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస అవకాశాలను సొంతం చేసుకొని బిజీగా మారిపోయారు. తాజాగా అజయ్ ఘోష్, ధనుష్ హీరోగా రూపొందిన ఓ తమిళ సినిమాలో విలన్గా నటించారు. ఇక తెలుగులో ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’ సినిమాతో మెప్పించిన దర్శకుడు ఈశ్వర్, అల్లరి నరేష్తో చేయనున్న సినిమాలో మెయిన్ విలన్గా నటించనున్నారు.
ఇదిలా ఉంటే.. తెలుగులో ప్రతిష్టాత్మకంగా మొదలుకానున్న మొదటి ఐఫా ఉత్సవంలో అజయ్ ఘోష్ ఉత్తమ విలన్ క్యాటగిరీలో రానా, కబీర్ సింగ్, ప్రభాకర్, సంపత్ రాజ్ తదితరులతో పోటీ పడుతున్నారు.