‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’.. ఇలా వరుస హిట్స్తో తెలుగులో అతికొద్ది మందికే సాధ్యమైన హ్యాట్రిక్ ఫీట్ను కెరీర్ ప్రారంభంలోనే సొంతం చేసుకున్న హీరో రాజ్ తరుణ్, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అంటూ తనకు సక్సెస్ ఫార్ములాగా నిలిచిన లవ్స్టోరీతోనే వచ్చినా ఆ సినిమా ఆశించినంతం ఫలితాన్నివ్వలేదు. ఇక ఈ రిజల్ట్తో సంబంధం లేకుండా రాజ్ తరుణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం మంచు విష్ణుతో ఓ మల్టీస్టారర్ చేస్తోన్న రాజ్ తరుణ్, తాజాగా ప్రముఖ నిర్మాత దిల్రాజు బ్యానర్లో హీరోగా ఓ సినిమా చేయనుండడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. గతంలో తెలుగులో పలు పెద్ద సినిమాలకు రచయితగా పనిచేసిన వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘శతమానం భవతి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్ళనున్నట్లు దిల్రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి సమాచారం.