మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. తమిళంలో బ్లాక్బస్టర్ విజయం సాధించిన తని ఒరువన్ సినిమాకు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కనుంది. రామ్ చరణ్ ‘తని ఒరువన్’ రీమేక్ ఒప్పుకున్నప్పట్నుంచే ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నారు. అన్ని కమర్షియల్ అంశాలను కలగలుపుకొని రూపొందిన డిఫరెంట్ సినిమా కావడంతో తని ఒరువన్ రీమేక్ తనకు మంచి గుర్తింపు తెస్తుందని చెర్రీ భావిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా స్క్రిప్ట్ను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
రామ్ చరణ్ ఇమేజ్కు, తెలుగు నేటివిటీకి సరిపడేట్టుగా కొన్ని మార్పులు చేశారని తెలుస్తోంది. ఇక ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను చివరిదశకు చేర్చేసిన ఈ సినిమా యూనిట్ త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళ వర్షన్లో విలన్గా నటించి మెప్పించిన అరవింద్ స్వామియే తెలుగులోనూ విలన్గా నటించనున్నారు. జనవరి నెలలో సినిమాను సెట్స్పైకి తీసుకెళ్ళేలా చెర్రీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన అఫీషియల్ లాంచ్ ఈ నెల్లోనే జరిగే అవకాశం ఉంది. అల్లు అరవింద్-ఎన్.వి.ప్రసాద్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.